రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతోంది. రోజురోజు ప్రముఖులు మొక్కలు నాటి పర్యావరణ అవసరంపై ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నిజమాబాద్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ జూబ్లీహిల్స్లోని జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా నిఖత్ జరీన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మనకు మంచి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందాలంటే ప్రతి ఒక్కరం మొక్కలు నాటి వాటిని పరిరక్షంచాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యులను చేసినందుకు ఎంపీ, సీఎం కేసీఆర్కి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్లో మరెన్నో పతకాలు సాధిస్తానని ప్రకటించారు. తెలంగాణ, భారతదేశం పేర్లు ప్రపంచ నలుమూలలకు వ్యాపించేందుకు కృషి చేస్తానన్నారు.