సెంచరీలతో రాణించిన మందాన,హర్మన్‌

129
smritikaur
- Advertisement -

మహిళల ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 317 పరుగులు చేసింది. భారత ఆటగాళ్లు స్మృతి మందాన,హర్మన్ ప్రీత్ కౌర్ సెంచరీలతో రాణించారు.

మందాన 123 ర‌న్స్ చేయగా 13 ఫోర్లు, రెండు సిక్స‌ర్లు ఉన్నాయి. వ‌న్డేల్లో స్మృతికి ఇది అయిదో సెంచ‌రీ కావ‌డం విశేషం. నాలుగో వికెట్‌కు హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్‌తో క‌లిసి స్మృతి 184 ర‌న్స్ జోడించారు. హర్మన్ 109 పరుగులతో రాణించారు.

2017 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లోనూ స్మృతి .. వెస్టిండీస్‌పై సెంచ‌రీతో హోరెత్తిన విష‌యం తెలిసిందే.

- Advertisement -