బెంగాల్‌ రైల్వే స్టేషన్‌లో ….లతా మంగేష్కర్‌లా

341
westbengal railway station
- Advertisement -

సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఓవ‌ర్ నైట్ స్టార్లు అయిపోయిన విష‌యం తెలిసిందే. తాజాగా పశ్చిమబెంగాల్‌ రణఘాట్ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ తన పాటతో స్టార్‌గా మారిపోయింది. ప్రతిభకు వయస్సు, అందంతో సంబంధంలేదని నిరూపిస్తూ లతా మంగేష్కర్ పాడిన ‘ఏక్ ప్యార్‌కి నగ్మా’ పాటను పాడి తన గాన మాధుర్యంతో ఎందరో హృదయాలను హత్తుకున్నారు.

ఆమె పాట‌కి నెటిజన్లు ప‌ర‌వ‌శించి ప్ర‌శంస‌లు గుప్పిస్తున్నారు. రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు. అచ్చం లతా మంగేష్కర్‌గా పాడుతోందని ప్రశంసించారు. ఇప్పటివరకూ ఈ వీడియో 20 లక్షల వ్యూస్ సాధించింది.

- Advertisement -