- Advertisement -
మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్నికయ్యారు. ముంబైలో జరిగిన సమావేశంలో ఫఢ్నవీస్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. ఈ సందర్భంగా మాట్లాడిన ఫడ్నవీస్ తన పట్ల విశ్వాసం ఉంచి తనను రెండోసారి బీజేఎల్పీ నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
శివసేనతో కలిసి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తున్నామని ..త్వరలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం ఈ కూటమిదే అన్నారు. కాంగ్రెస్తో శివసేన కలుస్తుందనే వదంతులు నమ్మవద్దని తెలిపారు.
అయితే రేపు శివసేన లేజిస్లేటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో శివసేన ఫ్లోర్ లీడర్ని ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు.50:50 ప్రాతిపదికన తమకు అధికార వాటా పంచాలని శివసేన డిమాండు చేస్తుండగా ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.
- Advertisement -