ఏపీలోనూ పోటీ చేస్తాం:కేటీఆర్

245
ktr
- Advertisement -

వచ్చే ఎన్నికల్లో ఏపీలో పోటీచేస్తామన్నారు మంత్రి కేటీఆర్. భరత్‌ నగర్‌లో మన హైదరాబాద్-మనందరి హైదరాబాద్ కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్ నాలుగేళ్లుగా హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణం ఉందన్నారు. చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో వేలుపెట్టాడని …రాజకీయంగా చంద్రబాబు సంగతేంటో తెలుస్తామన్నారు. ఏపీ ప్రజలతో తామెన్నడు తగాదాలు కోరుకోలేదన్నారు.

నాలుగు బిల్డింగ్‌లు కట్టి హైదరాబాద్‌ను తానే కట్టానని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని….మరి నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన సీఎం కేసీఆర్‌ను ఏమనాలన్నారు.ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసుందామన్నదే తమ సిద్దాంతం అన్నారు. తెలంగాణ వస్తే ఏదో జరుగుతుందని ప్రచారం చేశారు కానీ అవన్ని అవాస్తవాలే అని తెలిపోయిందన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబు అని మండిపడ్డారు. కరెంట్ గురించి అడిగితే కాల్చి చంపింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.

మాటల్లో ఏం చెప్పామో చేతల్లో కూడా అదే చేసి చపించామన్నారు.ఆర్థిక వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని స్పష్టం చేశారు. కరెంట్ కోతల కాలం నుంచి మిగులు విద్యుత్ దిశగా రాష్ట్రాన్ని తీసుకొచ్చామని..జూన్‌ లోగా కాళేశ్వరం పూర్తవుతుందన్నారు.

- Advertisement -