భూముల అక్రమాలపై చంద్రబాబుకు సీఐడీ నోటీసులు..

379
CBN
- Advertisement -

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి ఈ ఉదయం చేరుకున్న అధికారులు అమరావతి రాజధాని భూముల అక్రమాలపై నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు ఇంటికి మొత్తం ఆరుగురు అధికారులు చేరుకున్నారు. భద్రతా సిబ్బందితో మాట్లాడి లోపలికి వెళ్లారు.

41వ సీఆర్‌పీసీ కింద చంద్రబాబుకు నోటీసులు ఇచ్చామని, విచారణకు హాజరు కావాల్సిందిగా కోరామని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు. చంద్రబాబుపై 120బి, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకు కూడా 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు సీఐడీ అధికారులు.

- Advertisement -