NBK:బాలయ్య హ్యాట్రిక్ కొట్టేనా?

10
- Advertisement -

ఏపీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా కీలక నేతలంతా తమ గెలుపు కోసం విస్తృత ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నేత బాలకృష్ణ హిందుపూర్‌లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. వాస్తవానికి హిందుపూర్ టీడీపీ కంచుకోట. సీనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత హరికృష్ణ ఇక్కడి నుండి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.2014,2019లో రెండు సార్లు విజయం సాధించారు బాలయ్య. ఈ సారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు.

ఇక మరోవైపు బాలయ్యను ధీటుగా ఎదుర్కొనేందుకు హిందుపూర్ ఇంఛార్జీగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించిన జగన్, బాలయ్యపై ఓ మహిళను అభ్యర్థిగా నిలబెట్టారు. టార్గెట్ బాలయ్యగా పావులు కదుపుతున్న జగన్..హిందుపూర్ ప్రచారం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే బాలయ్య మాత్రం టీడీపీ కంచుకోటగా ఉన్న హిందుపూర్‌లో మళ్లీ టీడీపీ జెండా ఎగరవేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బాబు, పవన్ కలసి ప్రచారానికి వెళుతుండగా, బాలకృష్ణ మాత్రం సొంతంగా తన నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలను పలకరిస్తున్నారు. హ్యాట్రిక్‌పై బాలయ్య కాన్ఫిడెంట్‌గా ఉండగా వైసీపీ మాత్రం టీడీపీని ఓడించి తీరుతామని శపథం చేస్తోంది. మరి ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపుతారో వేచిచూడాలి.

Also Read:విశాఖలో దేవర!

- Advertisement -