ఇంతకీ బాలయ్యకి జోడీ ఎవరు?

14
- Advertisement -

భ‌గ‌వంత్ కేస‌రితో ‘బ్లాక్ బ‌స్ట‌ర్’ అందుకున్న బాల‌య్య‌, ప్ర‌స్తుతం బాబీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఐతే, ఈ సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందో తెలియదు కానీ.. ఇప్పటికే టాప్ హీరోయిన్లందరి పేర్లు ఒక రౌండ్ తిరిగి వచ్చాయి. ముందు త్రిష అన్నారు.. ఆ తర్వాత కాజల్ అగర్వాల్ అన్నారు. ఇప్పుడేమో నయనతార అని అంటున్నారు. ఇంతకీ, ఎవరు ఫైనల్ అయ్యారు అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. వాస్తవానికి ఈ సినిమాలో మొదట ఆషిక రంగనాధన్ పేరు బాగా వినిపించింది. ఆ తర్వాత ఈ చిత్ర దర్శకుడు బాబీ, హీరోయిన్ పాత్రలో శ్రుతి హాసన్ ని ఊహించుకుంటున్నట్లుగా చెప్పాడు.

ఇప్పుడు తమిళనాట శృతిహాసన్ చేతుల్లో పెద్దగా సినిమాలు కూడా లేవు కాబట్టి, ఆమెను పెట్టుకోవడం వేస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నయనతార లిస్ట్ లోకి వచ్చింది. ఆమె కూడా ఈ రోల్ పోషించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లుగా తమిళ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ వార్తలైనా నిజం ఉందా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది. నయనతార విషయానికి వస్తే.. చాలా గ్యాప్ తర్వాత ఆమె రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీలో ఆమె పట్టిందల్లా బంగారమవుతోంది. గాడ్ ఫాదర్, జవాన్.. ఇలా వరుస సక్సెస్‌లతో నయనతార పేరు మారుమోగుతోంది.

అయితే ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలకే పరిమితమైన నయనతార.. ప్రస్తుతం తల్లి అయ్యింది.మరి బాలయ్యతో మళ్ళీ ఎలాంటి రొమాన్స్ చేస్తోందో చూడాలి. అన్నట్టు ఈ సినిమాలో ఓ స్పెష‌ల్ రోల్ ఉంద‌ని, ఆ పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ న‌టించ‌నున్నాడ‌ని ఇప్పటికే వార్త‌లొచ్చాయి.ఇక బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బాబీతో చేస్తున్న 109వ సినిమాను ఎలాగైనా ఎల‌క్ష‌న్స్ లోపు పూర్తి చేయాల‌ని చూస్తున్నారు బాల‌య్య‌. ఎల‌క్ష‌న్స్ త‌ర్వాత బాల‌య్య త‌న 110వ సినిమాను బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌లో ఇప్ప‌టికే ఈ సినిమాకు అగ్రిమెంట్ జ‌రిగింద‌ని స‌మాచారం. ఇది అఖండ 2 అని టాక్.

Also Read:మొదటి సినిమాకే భారీ డిమాండ్

- Advertisement -