చరిత్రలో ఈ రోజు : డిసెంబర్ 13

276
What Happened Today in History
- Advertisement -

డిసెంబర్ 13, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 347వ రోజు (లీపు సంవత్సరములో 348వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 18 రోజులు మిగిలినవి.

*సంఘటనలు*

2001: భారత పార్లమెంటు పై ఐదుగురు తీవ్రవాదులు దాడి చేసిన సంఘటనలో ఆరుగురు పోలీసులు, ఒక తోటమాలి మరణించారు. మొత్తం తీవ్రవాదులందరూ భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యారు. వీరందర్నీ పాకిస్తాన్ దేశస్తులుగా గుర్తించారు.
1865 : శ్వేతజాతి ఆధిపత్యం తగ్గిపోవడాన్ని సహించలేని కొందరు దురహంకారులు కుక్లక్స్‌ క్లాన్‌ అనే సంస్థను స్థాపించారు. ఆ తర్వాత ఆ సంస్థ సభ్యులు నల్లజాతివారిపై చేసిన అత్యాచారాలకు అంతేలేదు.
1968 : నాసా అంతరిక్షనౌక అపోలో 8లోప్రయాణించిన వ్యోమగాములు చంద్రుడి కక్ష్యలో ప్రవేశించి ఆ ఘనత సాధించిన తొలి మానవులుగా చరిత్ర పుటలకెక్కారు.
1986 :పార్లమెంటు ఆమోదించిన వినియోగదారుల హక్కుల రక్షణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. నాటి నుంచి ఈ రోజును జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా జరుపుకొంటున్నాం.
1987 : తమిళనాడు రాజకీయాలను మలుపుతిప్పిన ఎం.జి.రామచంద్రన్ ‌ మరణించాడు.
1989 : మనదేశంలో మొట్టమొదటి ఎమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ ‘ఎస్సెల్‌ వరల్డ్‌’ ముంబయిలో ప్రారంభమైంది.
1999 : ఖాట్మండు నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండియన్‌ ఎయిర్‌లైన్‌ విమానాన్ని టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే తీవ్రవాదులు హైజాక్‌ చేశారు.
2000 : భారత్ కు చెందిన చదరంగం ఆటగాడు, విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు. ఆ ఘనత సాధించిన తొలి ఆసియా ఆటగాడు విశ్వనాథన్‌ ఆనంద్‌.
2002 : ఢిల్లీ మెట్రో రైల్వేను ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి ప్రారంభించాడు.

*జననాలు*

1835: పటాని సమంత్, భారతీయ ఖగోళ శాస్త్రవేత్త (మ.1904)
1894: బసవరాజు అప్పారావు, ప్రముఖ కవి. భావకవితాయుగంలోని ప్రఖ్యాత కవుల్లో ఒకడుగా ఆయన తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్థానాన్ని పొందాడు (1933).
1911: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ట్రిగ్వే హవిల్మొ (మ.1999).
1928: డి.వి.యస్.రాజు, తెలుగు సినిమా నిర్మాత. ఈయన ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడుగా పనిచేశాడు [మ. 2010].
1952: యెర్రగుడిపాటి లక్ష్మి, సుప్రసిద్ధ దక్షిణ భారతీయ నటీమణి, జూలీలో ప్రధాన పాత్ర పోషించిన నటిగా ప్రసిద్ధి చెందింది.
1960: దగ్గుపాటి వెంకటేష్, ప్రముఖ సినీ నటుడు.
1981: ఏమీ లీ, అమెరికన్ గాయని-గేయ రచయిత్రి మరియు పియానిస్ట్.
1989: టేలర్ స్విఫ్ట్, అమెరికా దేశపు గాయని, పాటల రచయిత, నటీమణి.

*మరణాలు*

1973: బారు అలివేలమ్మ, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు (జ.1897).
1977: బెహరా కమలమ్మ, “తనుమధ్యాంబ” పీఠమునకు వారసురాలు (జ.1904).
1986: స్మితాపాటిల్, హిందీ సినీనటి (జ.1955).
1994: నీలం రాజశేఖరరెడ్డి, భారతీయ కమ్యూనిస్టు నేత మరియు మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సోదరుడు (జ.1918).
2007: తేళ్ల లక్ష్మీకాంతమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రెసు నాయకురాలు మరియు పార్లమెంటు సభ్యురాలు. (జ.1924)

- Advertisement -