ఏప్రిల్ 27న పార్టీ మాస్కులు ధరిద్దాం- ఎంపీ సంతోస్‌

225
mp santhosh kumar
- Advertisement -

టీఆర్‌ఎస్‌ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న ఈ మాస్కును ధరించిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో (సోషల్ మీడియా ) పెట్టి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుందాం అని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి; రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కార్యకర్తల అందరికీ పిలుపునిచ్చారు.

దయచేసి కార్యకర్తలు మాస్క్ లను పంపిణీ చేసేటప్పుడు గుంపులుగా కాకుండా దూరంగా (సోషల్‌ డిస్టెన్స్‌ ) ఉండి పంచాలని ఎంపీ సంతోస్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. 20 సంవత్సరాలుగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సహచరులందరికి తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.. 27 ఏప్రిల్ రోజున పార్టీ మాస్కులు ధరిద్దాం, నిబంధనలు పాటిద్దాం అని పేర్కొన్నారు.

- Advertisement -