KCR:సికింద్రాబాద్‌లో బీఆర్‌ఎస్‌దే గెలుపు

12
- Advertisement -

సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ గెలుపు ఖాయమైందన్నారు మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించి రాష్ట్ర వ్యాప్త బస్ యాత్రకు శ్రీకారం చుటారు కేసీఆర్. బస్ యాత్ర కు బయల్దేరిన కేసీఆర్ కి మంగళ హారతులు పట్టారు మహిళలు. అలాగే బీఆర్ఎస్ నేతలు,శ్రేణులు, కార్యకర్తలకు వందనం చేస్తూ మిర్యాలగూడకు బయలుదేరారు.

కేసీఆర్ వెంట సంతోష్ కుమార్ జోగినపల్లి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు బస్సులో ఉన్నారు. ఇవాళ రెండు బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగించనున్నారు.

నేటి నుంచి 17 రోజుల పాటు సాగే ఈ యాత్ర కొన‌సాగ‌నుంది. మే నెల 10 వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. మిర్యాలగూడలో ప్రారంభమై సిద్దిపేటలో జరిగే బహిరంగసభతో ఈ యాత్ర ముగుస్తుంది. దాదాపు ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్‌షోలు ఉండే విధంగా బస్సు యాత్రను ప్లాన్‌ చేశారు.

Also Read:Ram Dev:మరోసారి క్షమాపణ చెప్పిన రాందేవ్

- Advertisement -