KTR: మూసీ బాధితులకు అండగా ఉంటాం

2
- Advertisement -

మూసీ ప్రాజెక్ట్ పేరుతో పేదల ఇళ్లు కూల్చుతామంటే ఊరుకునేది లేదంటూ ప్రభుత్వాన్ని కేటీఆర్ హెచ్చరించారు. వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. పర్మిషన్లు ఇచ్చి కరెంట్ బిల్లులు, ఇంటి పన్నులు కట్టించుకున్న కాంగ్రెస్ వాళ్లే పేదలను కబ్జాదారులనడం దారుణమని మండిపడ్డారు.

బాధితులు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ ధైర్యం చెప్పారు. మూసీ ప్రాజెక్ట్ పేరుతో కాంగ్రెస్ సర్కార్ తమ ఇళ్లను కూల్చే ప్రయత్నం చేస్తోందని.. తమకు అండగా ఉండాలంటూ తెలంగాణ భవన్ కు వచ్చిన బాధితులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా బాధితులందరికీ న్యాయ సాయం బీఆర్ఎస్ పార్టీయే చేస్తుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో ప్రజలకు 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు పేద ప్రజల ఇళ్లను గుంజుకుంటుందని మండిపడ్డారు.

Also Read:KTR:ఢిల్లీలో జుమ్లా పీఎం..రాష్ట్రంలో హౌలా సీఎం

బాధితులందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. ఎవ్వరూ ఆధైర్య పడవద్దని.. వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తమ ఇళ్లను కూలగొడతామంటూ ఇబ్బంది పడుతుందని బాధితులు కేటీఆర్ కు తమ ఆవేదన చెప్పుకున్నారు. 50 ఏళ్లుగా మూసీ పరివాహాక ప్రాంతంలో ఉంటున్న తమ ఇళ్లను కూల్చివేస్తామంటే ఎక్కడికి వెళ్లేదంటూ వాపోయారు. పేద ప్రజల ఇళ్లను ఇష్టానుసారంగా కూల్చేస్తామంటే ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బాధితులకు ఏ సమస్య వచ్చినా సరే బీఆర్ఎస్ స్థానిక నాయకులను సంప్రదించాలన్నారు. అదే విధంగా మీరు గెలిపించిన ప్రజాప్రతినిధులను కూడా నిలదీయాలని వారికి సూచించారు. ఈ సందర్బంగా తమకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన కేటీఆర్ కు మూసీ బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -