సుప్రీం తీర్పును గౌరవిస్తాంః సున్నీ వక్ఫ్‌ బోర్డు లాయర్‌

434
sunni
- Advertisement -

అయోధ్య రామ మందిరం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని తెలిపారు సున్నీ వక్ఫ్‌ బోర్డు లాయర్‌ జిలానీ. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంతీర్పు అసంపూర్తిగా ఉంది…అయినా సరే తీర్పును గౌరవిస్తున్నాం.

దీనిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మా అంచనాలకు అనుగుణంగా తీర్పు రాలేదన్నారు. రివ్వూ పిటిషన్ పై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. దేశం మొత్తం శాంతి యుతంగా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

- Advertisement -