ప్రకృతిని కాపాడుకోవాలి : ఎస్పీ సురేందర్‌ రెడ్డి

35
surendar
- Advertisement -

రాజ్యసభ సభ్యుడు ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ జోరుగా కొనసాగుతోంది. తాజాగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సురేందర్‌ రెడ్డి, తన కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ రాములు, పోలీస్‌ సిబ్బంది పాల్గోన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సురేందర్‌ రెడ్డి మాట్లాడుతూ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ నిరంతర ప్రక్రియని, ప్రకృతిని కాపాడాలంటే దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సుర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్‌, గద్వాల్‌ ఎస్పీ రంజన్‌ రతన్‌, సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్‌లకు ఛాలెంజ్‌ విసిరారు. మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి సవాలు చేయమని పిలుపునిచ్చారు.

- Advertisement -