శ్రీశైలంకు తగ్గిన వరద ఉధృతి..!

412
srishailam
- Advertisement -

ఇటివల కురిసిన వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్ట్‌ నిండుకుండను తలపిస్తోంది. నీటి మట్టం పెరగడంతో డ్యాం 10 గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి గత కొద్దిరోజులుగా వస్తున్న వరద ఉధృతి స్వల్పంగా తగ్గింది. డ్యాం నుండి నీటి విడుదల ఇంకా కొనసాగుతోంది. జలాశయం 10 క్రెస్ట్ గేట్లను 34 అడుగుల మేరకు తగ్గించి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.

కృష్ణా బేసిన్ జూరాల, తుంగభద్ర వేసిన సుంకేసుల ప్రాజెక్ట్ నుండి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొద్దిగా తగ్గినప్పటికీ జలాశయం 10 గేట్లు 34 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.ప్రస్తుతం జూరాల నుండి 6.80 లక్షల క్యూసెక్కులు, సుంకేసుల నుండి 59 వేల క్యూసెక్కులతో ఇన్‌ ఫో 7.24 లక్షల క్యూసెక్కుల నీరు జలాశయంలోకి చేరుతోంది.ప్రస్తుతం శ్రీశైలం జలాశయం 10 గేట్లను 34 అడుగుల మేర ఎత్తి 7 లక్షల 3 వేల 470 క్యూసెక్కుల నీటిని గేట్ల ద్వారా సాగరుకు విడుదల చేస్తున్నారు.

ఇక శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.40 అడుగులతో,గరిష్ట నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 196 5611 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక ప్రాజెక్టులోని కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా,ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా దాదాపు 69 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటూ ఏపీ మరియు టీఎస్ జెన్ కో అధికారులు విద్యుత్ ఉత్పత్తి చేస్తు, ఆ నీటిని దిగువ నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు. డ్యాం నుండి విడుదల అయ్యే మిగిలిన ఛానెల్స్ ద్వారా 40 వేల 610 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండడంతో మొత్తంగా శ్రీశైలం జలాశయం నుండి 8 లక్షల 58 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది.

- Advertisement -