కేటీఆర్‌ని కలిసిన వరంగల్ మేయర్ ప్రకాశ్‌ రావు…

302
ktr
- Advertisement -

వరంగల్ కొత్త మేయర్ గా గుండా ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని తెల మర్యాదపూర్వకంగా కలిశారు ప్రకాశ్‌ రావు. మేయర్‌ని అభినందించిన కేటీఆర్ ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలని సూచించారు.

ఏకగ్రీవంగా మేయర్ ఎన్నిక ను పూర్తి చేసినందుకు స్థానిక నాయకులతో పాటు పార్టీ ఇంచార్జీగా వ్యవహరించిన టి ఎస్ ఐ ఐ సి చైర్మన్ బాలమల్లుకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ నగర పాలక సంస్థ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకుపోవాలని, ఇందుకోసం స్థానిక కార్పొరేటర్లను అందర్నీ కలుపుకొని ముందుకు పోవాలని నూతన మెయర్ కి కేటీఆర్ సూచించారు.

ప్రకాశ్ రావుతో పాటు కేటీఆర్‌ని కలిసిన వారిలో జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, బండ ప్రకాష్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య, రాష్ట్ర సమితి మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి, పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజు సారయ్య, పార్టీ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మరియు పలువురు సీనియర్ నాయకులు కార్పొరేషన్ల చైర్మన్లు ఉన్నారు.

- Advertisement -