అజంజాహి మిల్స్‌ ప్రాంగణంలో వరంగల్ కలెక్టరేట్..

306
dayakarrao
- Advertisement -

వరంగల్ అజంజాహి మిల్స్ ప్రాంగణంలో వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం నిర్మాణం చేపడతామన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. హన్మకొండలోని రోడ్లు భవనాల శాఖ గెస్ట్ హౌస్‌లో సోమవారం వరంగల్ జిల్లా కలెక్టర్ హరిత, రెవెన్యూ అధికారులతో వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం భవన నిర్మాణానికి కావాల్సిన భూ సేకరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణానికి కావాల్సిన భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి భవన నిర్మాణ నిమిత్తం ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ని ఆదేశించారు ఎర్రబెల్లి. భూసేకరణలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవో మహేందర్ జీ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -