- Advertisement -
హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వార్ 2. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుండగా ఈ క్రేజీ మల్టీస్టారర్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన రైట్స్ను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సొంతం చేసుకుంది. నైజాంలో ఈ సినిమా పంపిణీ బాధ్యతలను మైత్రీ మూవీ మేకర్స్ కు నాగవంశీ ఇచ్చారు.
ఇక ఈ సినిమా ట్రైలర్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోండగా మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. జూలై 25 న ట్రైలర్ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హృతిక్ – ఎన్టీఆర్ ఇద్దరు ఐకాన్స్ 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 25 ని ఐకానిక్ గా లాక్ చేసి వారి సినిమాటిక్ జర్నీ లైఫ్ టైం లో గుర్తుండిపోవాలని డిసైడ్ చేసినట్టు చెబుతున్నారు.
Also Read:హద్దు దాటుతున్న ఈడీ అధికారులు!
- Advertisement -

