త్వరలో ఆర్ట్స్ కాలేజీలో వాకింగ్ ట్రాక్‌: ఎర్రబెల్లి

134
dayakarrao
- Advertisement -

హన్మకొండ (వరంగల్) ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో త్వరలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. ప్రతిరోజూ తన మార్నింగ్ వాక్ లో భాగంగా మంత్రి, శుక్రవారం వరంగల్ – హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో నడిచారు.

ఈ సదర్భంగా మంత్రి ఎర్రబెల్లి మార్నింగ్ వాకర్స్ తో కాసేపు మాట్లాడారు. వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ఆర్ట్స్ కాలేజి మైదానంలో ప్రతి రోజూ ఎంత మంది నడుస్తున్నారు? ప్రస్తుతం ఉన్న సదుపాయాలు ఎంటి? ఇంకా ఏమేమి కావాలి? అని అడిగి తెలుసుకున్నారు. మార్నింగ్ వాకర్స్ కోసం ప్రత్యేక వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

వరంగల్ లో, హన్మకొండలో, కాజీపేట లో పబ్లిక్ గార్డెన్స్ వంటి మరికొన్ని చోట్ల కూడా వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇప్పటికే అర్ ఇ సి ముందు సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వరంగల్ బాగా విస్తరిస్తున్న, స్మార్ట్ సిటీ అన్నారు. ఇందుకు తగ్గట్లుగా, ప్రజావసరాల కనుగుణంగా ఏర్పాట్లు ఉంటే బాగుంటుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి వాకర్స్ తో సందడి చేశారు.

- Advertisement -