గ్రేటర్‌ ఎన్నికలు.. మధ్యాహ్నం 3గంటల వరకు 25.34 శాతం పోలింగ్‌..

188
ghmc elections
- Advertisement -

జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ అత్యంత మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 25.34 శాతం ఓటింగ్ నమోదు కావడం పరిస్థితికి అద్దం పడుతోంది. దీనిపై ఎస్‌ఈసీ పార్థసారథి స్పందించారు. కరోనా వ్యాప్తి వల్ల కొంతమేర ఓటింగ్ తగ్గిందని, చలి వాతావరణం కూడా ఉదయం పూట ఓటర్లకు ప్రతిబంధకంగా మారిందని అన్నారు. గతంలో కరోనా లేనందువల్ల మధ్యాహ్నం 12 గంటల సమయానికే భారీగా పోలింగ్ జరిగేదని, ఈసారి మధ్యాహ్నం తర్వాత ఓటింగ్ శాతం పుంజుకుంటుందని భావిస్తున్నామని చెప్పారు.

ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్నికల్లో ఆందోళనకర స్థాయిలో గొడవలు ఏమీలేవని, పోలీసులు అప్రమత్తంగానే ఉన్నారని పార్థసారథి వెల్లడించారు. కాగా, నగరంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు రాకపోవడంతో, సిబ్బంది పనిలేక కునుకు తీస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు దర్శనమిస్తున్నాయి. గ్రేటర్‌ పరిధిలో జరుగుతున్న ఈ పోలింగ్ లో ఈసారి ఐటీ ఉద్యోగుల సందడి పెద్దగా కనిపించలేదు. ప్రతి ఒక్కరూ ఓటేయాలని విస్తృతంగా ప్రచారం జరిగినా ఆశించిన మేర ఓటింగ్ నమోదు కాలేదు. ఈసారి బల్దియా బరిలో 150 డివిజన్లకు గాను 1,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

మధ్యాహ్నం 3 వరకు పలు ప్రాంతాల్లో నమోదైన పోలింగ్‌ శాతం వివరాలు..
మాదాపూర్‌- 22.70
మియాపూర్‌- 25.47
హఫీజ్‌పేట- 20.98
చందానగర్-‌ 21.42
కొండాపూర్‌- 19.64
గచ్చిబౌలి- 26.56
శేరిలింగంపల్లి- 23.24
సరూర్‌నగర్‌- 27
ఆర్కే పురం- 19.96
సైదాబాద్‌- 16.69
మూసారంబాగ్‌- 17.92
అక్బర్‌బాగ్‌- 18.24
రాజేంద్రనగర్- 24.62
చార్మినార్‌- 24.23
సంతోశ్​‌నగర్‌- 17.26
మలక్‌పేట– 15.88
చాంద్రాయణగుట్ట– 15.19
ఫలక్‌నుమా- 17.61

- Advertisement -