గెల్లును గెలిపించండి…

115
harish
- Advertisement -

హుజురాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రజలను కోరారు మంత్రి హరీష్ రావు. జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్ లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు నాయకులు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు హరీష్ రావు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. నిన్న మొన్న రాజేందర్ గారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ వారు మా నాయకులను ప్రలోభ పెడతున్నారు..ఈ యువకులను ఎవరైనా ప్రలోభ పెడ్తారా.. ఈటల రాజేందర్ వెంట నాయకులు ఎవరు లేరన్నారు. ఈటల రాజేందర్ పార్టీ లో చేరక ముందే ఈ ప్రాంతమంతా గులాబీ జెండా తో రెప రెప లాడిన గడ్డ ఇది.. 2018 లో బీజేపీ కి ఎన్ని ఓట్లు వచ్చాయో చెప్పాలన్నారు. రాజేందర్ మాట్లాడే వి శ్రీరంగ నీతులు..చేసేవి ఎంటి అని ఎద్దేవా చేశారు. వ్యక్తి గా వచ్చిండు గౌరవించాం..వ్యక్తిగా వెళిపోయాడన్నారు.

రాజకీయంలో పైసలు, మద్యం పంచే టైం వస్తె నేను రాజకీయం నుండి తప్పుకుంటా అన్నాడు..ఓటుకు పది వేలు పంచుతా…200 ఎకరాల ఆస్థి ఉంది….ఎకరం అమ్ముతా..పంచుతా అని ఈటల అన్నారు..అతని వెనుక నాయకులు లేక పోయే సరికి ప్రస్టేశన్ లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడు తున్నారు. ఓటమి భయముతో రాజేందర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.

టీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇస్తున్నారు అని ఆరోపణలు చేశారు. మరి గడియారాలు, మాస్క్ లు, గొడుగు, మేకలు, మధ్యం ,దావత్ లు ఎవరు ఇస్తున్నారు.. రాజేందర్ కాదా..అస్సలు ఇక్కడ బీజేపీ ఉందా అని ప్రశ్నించారు. వ్యవసాయ రంగములో తెలంగాణ ఇంత అభివృద్ధి సాధిస్తే.. కేంద్రం నల్ల చట్టాలు తెచ్చింది.మరి ఇక్కడ రాజేందర్ గెలిస్తే మీకు ఏమైనా పని అవుద్ధా.. శ్రీనివాస్ యాదవ్ గెలిస్తే కేసీఆర్ ని ఒప్పించి మెడికల్ కాలేజ్ తెస్తానని తెలిపారు.

- Advertisement -