మార్చి 29 నుంచి ఐపీఎల్‌..

341
ipl 2020
- Advertisement -

ఐపీఎల్ 2020కి రంగం సిద్ధమైంది. మార్చి 29న ముంబైలోని వాంఖడే వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబైతో చెన్నై తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ప్రస్తుతానికి లీగ్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌నే విడుదల చేయగా, నాకౌట్‌ మ్యాచ్‌ల వివరాలను తర్వాత ప్రకటిస్తారు.

ఇప్పుడు తొలి రోజు, చివరి రోజు మినహాయించి మిగిలిన ఆదివారాల్లో మాత్రమే డబుల్‌ హెడర్‌లు జరుగుతాయి. దీంతో లీగ్‌ దశ రోజుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు 44 రోజుల్లో లీగ్‌ మ్యాచ్‌లను ముగిస్తుండగా, ఇప్పుడు అది 50 రోజులు కానుంది. మరోవైపు రాజస్తాన్‌ మినహా మిగిలిన ఏడు ఐపీఎల్‌ జట్లన్నీ తమ సొంత వేదికలను కొనసాగించనున్నాయి.

ఏప్రిల్‌ 1 నుంచి హైదరాబాద్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తమ హోం మ్యాచ్‌లను ఉప్పల్‌ స్టేడియంలో ఆడనుంది. హైదరాబాద్‌లో ఈ ఏడు మ్యాచ్‌లు ఏప్రిల్‌ 1, 12, 16, 26, 30, మే 5, 12 తేదీల్లో జరుగుతాయి. మే 17న ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ జరుగగా ఫైనల్‌ మే 24న జరగనుంది.

- Advertisement -