సినీ కార్మికుల‌కు రూ. 5 ల‌క్ష‌లు విరాళం ఇచ్చిన విశ్వ‌క్ సేన్

336
- Advertisement -

క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే లాక్ డౌన్ వ‌ల్ల సినీ కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈసంద‌ర్భంగా సినీ పెద్ద‌లు కార్మికుల‌కు అండ‌గా నిలుస్తున్నారు. త‌మ వంతు సాయంగా స‌హాయం చేస్తున్నారు. తాజాగా హీరో విశ్వ‌క్ సేన్ కార్మికుల‌కు రూ.5ల‌క్ష‌లు విరాళంగా ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈసంద‌ర్భంగా విశ్వ‌క్ సేన్ మాట్లాడుతూ…కోవిడ్‌-10 వ్యాప్తిని అదుపు చేయ‌డానికి మ‌న‌దేశం అత్యంత ముఖ్య‌ద‌శ‌లోకి ప్ర‌వేశిస్తున్న సంద‌ర్భంలో, అహ‌ర్నిశ‌లూ ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన సేవ‌ల‌ను అందిస్తూ వ‌స్తోన్న వైద్య సిబ్బందికీ, పోలీస్ డిపార్ట్‌మెంట్‌కూ, ఈ క్లిష్ట కాలంలో త‌మ వంతు సేవ‌లు అందిస్తూ వ‌స్తోన్న ప్ర‌తి వ్య‌క్తికీ ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాను. మీ ఆరోగ్యం కంటే దేశానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న మీకు త‌గిన‌విధంగా కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోగ‌ల‌న‌ని నేను అనుకోవ‌ట్లేదు.

ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో నేను నా బాల్క‌నీలో నిల్చొని ఖాళీగా ఉన్న రోడ్ల‌ను చూస్తున్న‌ప్పుడ‌ల్లా, వీలైనంత త్వ‌ర‌గా సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటే బాగుండున‌నే ఫీలింగ్ నిరంత‌రం క‌లుగుతోంది. కానీ దానికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని నాకు తెలుసు. ఇది క‌ష్ట కాలమ‌ని నేను అర్థం చేసుకున్నాను. ఈ సంద‌ర్భంలో మ‌న‌మంతా మ‌నుషులుగా మ‌న బ‌లాన్నీ, బాధ్య‌తాయుత ప్ర‌వ‌ర్త‌న‌నూ, కామ‌న్ సెన్స్‌నూ, క‌రుణ‌నూ స‌మ‌ష్టిగా ప్ర‌ద‌ర్శించాల‌ని అవ‌గ‌తం చేసుకున్నాను. ఈ ప‌రిస్థితిలోని సీరియ‌స్‌నెస్‌ను అర్థం చేసుకొని, అవ‌స‌ర‌మైనంత కాలం ఒక‌రికొక‌రం సామాజిక దూరం పాటించ‌డం చాలా కీల‌కం.

అంతే కాకుండా, ఒక‌రికొక‌రం.. అది చిన్న‌దైనా స‌రే.. సాధ్య‌మైనంత వ‌ర‌కు సాయం చేసుకోవాలి, మాన‌వ‌జాతిగా ఐక్యంగా ముందుకు సాగాలి. నా వంతుగా.. ఈ మ‌హ‌మ్మారి వ‌ల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌, ఆస‌రా కోసం ఎదురుచూస్తున్న తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మలోని కార్మికుల‌కు రూ. 5 ల‌క్ష‌లు విరాళంగా అంద‌జేస్తున్నాను అన్నారు.

- Advertisement -