హీరో అతనే విలనూ అతనే

7
- Advertisement -

కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నా ప్రస్తుతం కూల్ గా లైమ్ టైమ్ లోకి వచ్చేసాడు. క్రేజీ ప్రాజెక్ట్స్ తో హడావిడి మొదలు పెట్టాడు. సూపర్ మేకోవర్ తో కనబడుతున్న విశాల్.. కోలీవుడ్ లో పలు ప్రాజెక్ట్స్ కి సైన్ చేసినా.. ప్రెజెంట్ మాత్రం విశాల్.. తానే నిర్మాతగా తెరకెక్కనున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఓ కొత్త దర్శకుడు డైరెక్టర్ గా చేస్తారని టాక్ ఉంది. ఈ చిత్రంలో విశాల్ హీరోగానూ, అలాగే విలన్ గాను రెండు పాత్రల్లో నటించనున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా ఈ చిత్రంలోనే విశాల్ ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ తో జత కట్టబోతున్నట్లుగా కోలీవుడ్ మీడియాలో ప్రచారం షురూ అయ్యింది.

పియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరో విశాల్ పాత్రకి ఓ హీరోయిన్, అలాగే విలన్ విశాల్ పాత్రకి మరో హీరోయిన్ ని సెట్ చేశారట. అందులో విలన్ పాత్రకి బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటించనున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అలాగే హీరో పాత్రకి ప్రియమణి జత కడుతుంది అంటూ సోషల్ మీడియాలో ఒకటే కథనాలు కనిపిస్తున్నాయి. మరి ఈ ఇద్దరి హీరోయిన్స్ తో విశాల్ ఎంత రొమాంటిక్ గా రెచ్చిపోతాడో చూడాలి. మరోపక్క ఈ సినిమాలో కమల్ హాసన్ అతిధి పాత్రలో నటించబోతున్నాడట. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, ఇది పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది అని టాక్.

మొత్తానికి విశాల్ మళ్లీ మరో క్రేజీ సినిమాతో రాబోతున్నాడు. అన్నట్టు వచ్చే ఎన్నికల్లో విశాల్ రాజకీయాల్లో కూడా జాయిన్ అవుతాడట. ఓ పార్టీలో జాయిన్ అయ్యి, ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయాలని విశాల్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఎప్పటి నుంచో విశాల్ కి రాజకీయాల పై బాగా ఆసక్తి. ఆ ఆసక్తి కారణంగానే విశాల్ ప్రస్తుతం రాజకీయాల పై మొజి చూపిస్తున్నాడు.

Also Read:మొదటి సినిమాకే భారీ డిమాండ్

- Advertisement -