ఫిబ్రవరి 4న విశాల్ ‘సామాన్యుడు’!

65
vishal
- Advertisement -

యాక్షన్ హీరో విశాల్ లేటెస్ట్ మూవీ ‘సామాన్యుడు’ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాతో తు ప శరవణన్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ యాక్షన్ డ్రామాకు నాట్ ఏ కామన్ మ్యాన్ అనేది ట్యాగ్‌లైన్‌. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ప‌తాకంపై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన రావ‌డంతో తెలుగు, తమిళ భాషల్లో సినిమా మీద అంచనాలు పెరిగాయి.

తాజాగా సినిమా రిలీజ్ డేట్ కన్ఫామ్ అయింది. ఫిబ్రవరి 4న సినిమా థియేటర్లకు రానుంది. యోగిబాబు, బాబురాజ్ జాకబ్, పా తులసి, రవీనా రవి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ త్వ‌ర‌లో విడుద‌ల కానుంది.

- Advertisement -