మళ్ళీ ఫిక్స్‌ అయిన లవర్స్…!

298
Vishal and Varalakshmi unite again
- Advertisement -

కథ అయిపోయిందని అంతా అనుకుంటున్న సమయంలో పాత ప్రేమికులు విశాల్ వరలక్ష్మి ఇద్దరూ కలిసి కోలీవుడ్ కి మళ్ళీ పెద్ద షాక్ ఇచ్చారు. విశాల్ తో తొలిసారి ‘మదగజరాజా’ మూవీలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన వరలక్ష్మీ ఇప్పుడు మరోసారి నల్లనయ్యతో జోడీ కట్టబోతోంది.

ప్రస్తుతం ఈ వార్తే కోలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. కలిసి నటించింది ఒకే ఒక్క సినిమాలో అయినా చిన్నప్పటి నుండీ స్నేహితులు కావడంతో విశాల్ – వరలక్ష్మీ మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తోందని కోలీవుడ్ వర్గాలు ఎప్పటి నుండో చెబుతున్నాయి.
Vishal and Varalakshmi unite again
శరత్ కుమార్‌తో వైరం కారణంగా బయటకు వ్యక్తం చేయడం లేదు కానీ… విశాల్… వరలక్ష్మీని వివాహం చేసుకునేది ఖాయమనీ కొందరంటున్నారు… ఈ నేపథ్యంలో ‘మదగజరాజా’లో తొలిసారి జోడీ కట్టిన ఈ జంట… ఇప్పుడు మరోసారి స్ర్కీన్ ను షేర్ చేసుకోబోతోంది… విశాల్ నటించి, నిర్మించబోతున్న ‘పందెం కోడి’ సీక్వెల్ లో వరలక్ష్మీ ఓ కీలక పాత్ర పోషించబోతోందట..

తనకు బ్రేక్ ఇచ్చిన ‘పందెం కోడి’ మూవీకి సీక్వెల్ చేయాలని విశాల్ ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నాడు… దర్శకుడు లింగుస్వామి సైతం ఈ సినిమా మీద కొద్ది రోజులు వర్క్ చేసి, ఆ తర్వాత ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు… దాంతో ఆగ్రహించిన విశాల్ నిర్మాతల మండలికి లింగుస్వామి మీద ఫిర్యాదు చేశాడు… ఇప్పుడు మళ్ళీ సమీకరణాలు మారడంతో లింగుస్వామి ‘పందెంకోడి’ సీక్వెల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు… తొలి భాగంలో మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించగా… ఇందులో కీర్తి సురేశ్ చేస్తోంది.
 Vishal and Varalakshmi unite again
అయితే మరో కీలకమైన పాత్రకు వరలక్ష్మీని ఎంపిక చేశారట. విశేషం ఏమంటే… ఇప్పటికే ఆరేడు సినిమాలతో బిజీ బిజీగా ఉన్న వరలక్ష్మి, విశాల్ మీద ప్రేమతో ఈ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేసి ఇచ్చిందట… జులైలో సెట్స్ కెళుతున్న ‘పందెం కోడి’ సీక్వల్ ఈ లవర్స్ ని మళ్ళీ కలిపి.. పెళ్ళి వరకూ నడిపిస్తుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. చూడాలి మరి ఏం జరగనుందో.

- Advertisement -