వీరజవాన్లకు సెల్యూట్…

206
kohli
- Advertisement -

భారత్, చైనా మధ్య జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన భారత జవాన్లకు యావత్ దేశం నివాళులర్పిస్తోంది. చైనాతో జరిగిన ఘర్షణలో 20 మంది జవాన్లు చనిపోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ నేపథ్‌యంలో సోషల్‌ మీడియా వేదికగా నివాళులర్పించారు విరాట్‌ కోహ్లి .

గాల్వన్‌లో మన దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు నా నమస్కారం. సైనికుడి కంటే ఏ ఒక్కరూ ధైర్యంగా, నిస్వార్థంగా లేరు. వారి కుటుంబాలకు హృదయ పూర్వక సంతాపం తెలుపుతున్నా. ఈ క్టిష్ల సమయంలో వారు మా ప్రార్థనల వల్ల శాంతిని పొందుతారని ఆశిస్తున్నా అని కోహ్లి తెలిపారు.

నిజమైన హీరోలకు నా సెల్యూట్‌. వీర మరణం పొందిన వారు మా సరహద్దును రక్షించి, మమ్మల్ని గౌరవించారు. భగవంతుడు వారి కుటుంబాలకు బలాన్ని చేకూర్చాలని రోహిత్‌శర్మ ట్వీట్‌ చేశారు.

- Advertisement -