బుర్జ్ ఖలీఫా’పై ‘విక్రమ్’

99
- Advertisement -

లోకేశ్‌ కనగరాజ్ దర్శకత్వంలో విశ్వ నటుడు కమల్ హాసన్ నటించిన చిత్రం ‘విక్రమ్’. ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న సినిమా విడుదల కానుండగా ఇప్పటికే సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది చిత్రయూనిట్.

తాజాగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం దుబాయ్లోని ‘బుర్జ్ ఖలీఫా’ స్క్రీన్ పై విడుదల చేశారు కమల్ హాసన్ అక్కడే కూర్చొని తిలకించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒక సీన్ లో హీరో సూర్య కూడా కనిపించనున్నారు.

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇది ప్రీ రిలీజ్ వ్యాపారంలోనే దాదాపు రూ.200 కోట్లను ఆర్జించింది.

- Advertisement -