అయోధ్యలో రామమందిరం..కథ సిద్ధంచేస్తున్న విజయేంద్రప్రసాద్..!

651
kangana
- Advertisement -

భజరంగీ భాయ్ జాన్, బాహుబలి వంటి భారీ సినిమాలకు కథలందించి, దేశవ్యాప్త గుర్తింపు పొందిన రైటర్ విజయేంద్రప్రసాద్. ప్రత్యేకించి కొడుకు రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలకు కథ అందించే విజయేంద్ర ప్రసాద్…ప్రస్తుతం తన ఫోకస్ బాలీవుడ్ క్వీన్ కంగనా రౌత్‌పై దృష్టి సారించారు.

ఇటీవలె కంగనా స్వీయ దర్శకత్వంలో, ప్రధానపాత్రలో తెరకెక్కిన‘మణికర్ణిక’ వంటి సినిమాకు కథ అందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో కంగనా కోసం మరో కథను సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు విజయేంద్ర ప్రసాద్.

ఇటీవలె సొంత ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేసింది కంగనా. మణికర్ణిక ఫిల్మ్స్‌ పేరుతో సినిమాలను నిర్మిస్తోంది కంగనా. తన సొంత బ్యానర్‌లో సినిమాను కూడా అనౌన్స్ చేయగా ఈ మూవీకి కథను అందిస్తున్నారు విజయేంద్ర ప్రసాద్.

అయోధ్య రామమందిరం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుండగా వచ్చే ఏడాది సెట్స్‌ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. మొత్తంగా కంగనా కోసం విజయేంద్ర ప్రసాద్ ఎలాంటి కథను సిద్ధం చేస్తున్నాడోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

SS Rajamouli father Vijayendra Prasad has been penning scripts for Kangana Ranaut. He wrote the story and screenplay of ‘Manikarnika’ which became a good hit.

- Advertisement -