తెలంగాణ ఏర్పాటులో బీజేపీ ఎక్కడుంది:విజయశాంతి

18
- Advertisement -

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించడాన్ని తప్పుబట్టారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. దీనిపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు విజయశాంతి. ఎక్స్ వేదికగా స్పందించిన విజయశాంతి…ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని ప్రకటించి మాట తప్పి, తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ బాధ్యత తీసుకోక విడిచిపెట్టిన నాడు, UPA భాగస్వామ్య పక్షాలన్నింటిని ఒప్పించి, కాంగ్రెస్ కు రాజకీయంగా నష్టం జరిగినా తెలంగాణ ఏర్పాటుకు సోనియాగాంధీ చేసిన త్యాగం తెలంగాణ ఉద్యమకారులు గౌరవించి తీరుతరు ఎన్నడైనా అన్నారు.

ఆ సోనియా గాంధీ గారు, రేపటి జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవ కార్యక్రమంకు ఎట్ల హాజరు అయితరు అని బీజేపీ నేత కిషన్ రెడ్డి గారు అడిగితే, అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంలో నాటి బీజేపీ ప్రమేయం ఎక్కడున్నది (ప్రత్యామ్నాయం లేక పార్లమెంటుల బిల్లుకు ఓటు వేసిన నాడు తప్ప) అని కూడా తెలంగాణ సమాజం, ఉద్యమకారులు అడిగితీరుతరన్నారు. సోనియాకు సంపూర్ణ అర్హత ఉంది… అడిగే అర్హత బీజేపీ కి నిజానికి నిజాయితీగా ఐతే లేదన్నది కాదనలేని వాస్తవం అని తెలిపారు.

Also Read:NKR21లో రాములమ్మ!

https://x.com/vijayashanthi_m/status/1795503588770484423

- Advertisement -