లేడీ అమితాబ్‌ రీ ఎంట్రీ..

219
- Advertisement -

చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి టాలీవుడ్‌లో ఉన్న అగ్ర నటుల అందరితో నటించి హీరోలతో సమానంగా పారితోషకం తీసుకున్న ఏకైక నటి విజయశాంతి. టాలీవుడ్‌లో హీరోలు ఆధిపత్యం చలాయిస్తున్న సమయంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీసి హీరోతో సమానంగా తనకంటు స్టార్‌ స్టెటస్‌ని సంపాదించుకుంది.మరి ఒకప్పుడు టాప్‌ హీరోతో పాటు సమానంగా పారితోషకం తీసుకున్న హీరోయిన్‌ విజయశాంతి.అయితే ‘లేడీ అమితాబ్’ గా పిలిపించుకున్న ఈ మాజీ హీరోయిన్. తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఓ ఏడాది క్రితం ఈమె రీఎంట్రీ గురించిన వార్తలు వచ్చాయి. కాని ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ రాలేదు. గతంలో మాదిరిగానే ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ చేస్తారనే టాక్ వినిపించింది.

Vijayashanthi Come Back to Movies

అయితే.. ఆ మూవీ కోసం ప్రిపేర్ అవుతున్న సమయంలో ఈమె కాలికి ఫ్రాక్చర్ అయిందట. లిగ్మెంట్ కదలడంతో సుదీర్ఘకాలం పాటు చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. అంతే కాదు.. పాదానికి కూడా కొన్ని ఆపరేషన్స్ చేశారని తెలుస్తోంది. హెవీ వర్కవుట్స్ చేయడం కారణంగానే ఇలా జరిగిందని. ఇకపై పూర్తి జాగ్రత్తగా ఉండాలని సూచించిన డాక్టర్స్ విజయశాంతిని డిశ్చార్జ్ చేశారని తెలుస్తోంది. కొంతకాలం పాటు బెడ్ రెస్ట్ కూడా అవసరమని చెప్పారట. అయితే.. కొన్ని వారాలు మాత్రమే రెస్ట్ తీసుకున్న విజయశాంతి.. తిరిగి వర్కవుట్స్ మొదలుపెట్టేశారని సన్నిహితులు అంటున్నారు.

మరి ఈ లేడీ అమితాబ్‌ ప్రస్తుతం రోజుకు రెండున్నర గంటలపాటు జిమ్ లో గడుపుతూ వర్కవుట్స్ చేస్తున్నారు. అయితే.. పాదంపై మాత్రం భారం పడకుండా జాగ్రత్తపడుతూ హెవీ వర్కవుట్స్ నే చేస్తున్నట్లు టాక్. మరికొన్ని నెలల్లోనే కొత్త సినిమా ప్రారంభానికి ఆమె విజయశాంతి సిద్ధమవుతున్నారని.. ఒకట్రెండు నెలల్లో షూటింగ్ ప్రారంభించవచ్చని టాలీవుడ్ టాక్ మరి విజయశాంతి తీయబోయే సినిమా ఎలా ఉండబోతుంది,ఎప్పుడు ప్రారంభంకానుంది అని సిని ప్రేక్షకులతో పాటు సిని వర్గాలు కూడా వేచి చూస్తున్నారట..

- Advertisement -