చంద్రబాబు…బతుకంతా డొల్లతనమే:విజయసాయి రెడ్డి

110
vijayasai reddy
- Advertisement -

ఏపీ మాజీ సీఎం,టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. చంద్రబాబు బతుకు అంతా.. అన్నీ దొంగ మాటలు, డొల్లతనమేనని దుయ్యబట్టారు. ఈ జీవి జీవితమే అంత అని… వినేవాడుంటే- చార్మినార్ కూడా నేనే కట్టా అని ఎద్దేవా చేశారు.

హైదరాబాద్ లో జెనోమ్ వ్యాలీ తానే పెట్టాను అంటూ పదే పదే డబ్బా కొట్టే ఫేక్ విజనరీ, మీడియా మేడ్ మాన్ చంద్రబాబు బతుకు – అన్నీ దొంగ మాటలు, డొల్లతనమే అని విమర్శించారు. ఈ జీవి జీవితమే అంత. వినేవాడుంటే – చార్మినార్ కూడా నేనే కట్టా అంటాడు చంద్రం అని విమర్శించారు.

పార్టీ లేదు బొక్కా లేదు అని అచ్చెన్నాయుడు చికాకులో నోరు జారి ఉంటాడని అనుకున్నారు కానీ అది నిజమేనని తెలియడం లేదా అని ప్రశ్నించారు.

- Advertisement -