ఇక సెలవు..విజయ నిర్మలకు కన్నీటి వీడ్కోలు

552
vijaya nirmala
- Advertisement -

అలనాటి అందాల తార విజయనిర్మల భౌతికంగా ఈ ప్రపంచానికి వీడ్కోలు చెప్పారు. ఇక సెలవంటూ భూవి నుంచి దివికేగసారు. విజయనిర్మలను కడసారి చూసేందుకు కుటుంబసభ్యులతో పాటు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. చిలుకూరు విజయగార్డెన్స్‌లో విజయ నిర్మల పార్థివదేహానికి నరేష్ నిప్పంటించారు.

తొలుత నానక్‌రామ్‌గూడలోని స్వగృహం ఫిల్మ్ ఛాంబర్‌కు తరలించారు. అక్కడ కొద్దిసేపు ఉంచి చిలుకూరులోని విజయగార్డెన్స్‌కు తరలించారు. ఈ అంతిమ యాత్రలో సూపర్‌స్టార్ కృష్ణ, మహేశ్ బాబుతోపాటు ఎంపీ గల్లా జయదేవ్, అరుణకుమారి, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. వేలాది మంది అభిమానులు కూడా తమ అభిమాన నటిని కడసారి చూసేందుకు తరలివచ్చారు. దీంతో నానక్‌రామ్‌గూడ, ఖాజాగూడలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.

- Advertisement -