తెరపై మరోసారి సర్కార్ జోడి..!

200
vijay
- Advertisement -

తమిళ సూపర్ స్టార్ విజయ్-మహానటి ఫేమ్ కీర్తి సురేష్ కాంబినేషన్‌లో గతేడాది వచ్చిన మూవీ సర్కార్. తమిళ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా విజయ్-కీర్తి సురేష్ కాంబో ప్రేక్షకులను ఫిదా చేసింది.తాజాగా వీరి కాంబినేషన్‌లో మరోసారి సినిమా రానుంది.

రాజా రాణి , తెరి , మెర్సల్ వంటి చిత్రాలను రూపొందించి పెద్ద దర్శకుడిగా మారిన శంకర్‌ శిష్యుడు అట్లి ఈ సినిమాను
తెరకెక్కించనున్నారు . విజయ్‌తో ‘తెరి’, ‘మెర్సల్‌’ వంటి బ్లాక్‌బస్టర్లను అందించిన ఆయన హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాలో విజయ్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనుండగా ఒక హీరోయిన్‌గా నయన్ కన్ఫామ్ అయింది. మరో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ని తీసుకోనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

సినిమాకు సంబంధించి కీర్తి సురేష్‌తో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. గతంలో విజయ్‌, కీర్తిసురేష్‌ కలిసి నటించిన ‘భైరవ’, ‘సర్కార్‌’ మంచి హిట్ సాధించాయి. అదేవిధంగా ‘శివకాశి’, ‘విల్లు’ సినిమాల్లో నయన్‌తో జోడికట్టిన విజయ్‌ తాజాగా ఈ ఇద్దరు హీరోయిన్లతో ముచ్చటగా మూడోసారి జతకడుతున్నారు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -