సిద్దు-విజయ్.. బాక్సాఫీస్ వార్!

14
- Advertisement -

టాలీవుడ్ టైర్ 2 హీరోల జాబితాలో విజయ్ దేవరకొండ, సిద్దు జొన్నలగడ్డ వంటి హీరోలకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అర్జున్ రెడ్డితో యూత్ లో ఓ రేంజ్ ఫాలోయింగ్ విజయ్ దేవరకొండ సంపాధించుకోగా, డీజే టిల్లు మూవీతో సిద్దు జొన్నలగడ్డ కూడా మంచి క్రేజ్ సంపాధించుకున్నాడు. వీరిద్దరు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లపై కన్నెశారు. టిల్లు స్క్వేర్ మూవీతో మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చారు సిద్దు జొన్నలగడ్డ. గతంలో వచ్చిన డీజే టిల్లు మూవీకి సిక్వల్ గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. విడుదల అయిన ఐదు రోజుల్లోనే 85 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను రాబడుతోంది టిల్లు స్క్వేర్ మూవీ. ఇప్పటికే లాభాల బాటాలో నడుస్తున్న ఈ మూవీ వంద కోట్లకు చేరువలో ఉంది..

బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం సినిమాలేవీ లేకపోవడంతో సిద్దు జొన్నలగడ్డ వంద కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ వారంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఏప్రెల్ 5 న విడుదల కానుంది. ఈ మూవీపై కూడా అంచనాలు బారిగానే ఉన్నాయి. అయితే ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ తరువాత టిల్లు స్క్వేర్ కలెక్షన్లలో డ్రాప్ కనిపించే అవకాశం ఉంది. అటు విజయ్ దేవరకొండ కూడా ఫ్యామిలీ స్టార్ మూవీతో 100 కోట్ల గ్రాస్ పై కన్నేశాడు. విజయ్ నటించిన గత చిత్రాలు లైగర్, ఖుషీ ఫ్లాప్ అయినప్పటికి ఫ్యామిలీ స్టార్ హిట్ అవుతుందని విజయ్ నమ్మకంతో ఉన్నాడు. ఒకవేళ ఫ్యామిలీ స్టార్ హిట్ అయితే విజయ్ క్రేజ్ దృష్ట్యా వంద కోట్లు సాధించడం పెద్ద విషయమేమి కాదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఆల్రెడీ హిట్ టాక్ తో వంద కోట్ల దిశగా దూసుకుపోతున్న సిద్దు జొన్నల గడ్డ మూవీకి విజయ్ ఫ్యామిలీ స్టార్ ఎంతవరకు బ్రేకులు వేస్తుందో చూడాలి.

Also Read:TTD: 5న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

- Advertisement -