తిత్లీ బాధితులకు అండగా ‘అర్జున్‌రెడ్డి’

213
VIjay Devarakonda
- Advertisement -

తిత్లీ తుఫాన్ ఏపీని అతలాకుతలం చేసింది. ముఖ్యంగా శ్రీకాకులం జిల్లాకు పెను విషాదాన్ని మిగిల్చిన తిత్లీ…వందల గ్రామాలకు కడగండ్లనే మిగిల్చింది .భారీ ఆస్తి నష్టం సంభవించడంతో ప్రజలు అల్లాడిపోయారు. తిత్లీ బాధితులను ఆదుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే కేంద్రాన్ని కోరారు. పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే తిత్లీ బాధితులను ఆదుకునేందుకు ముందుకువచ్చారు.

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తన వంతు సాయం ప్రకటించిన తొలి ఆర్టిస్ట్‌గా నిలవగా తాజాగా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ విజయ్ దేవరకొండ ముందుకువచ్చారు. తన వంతుగా సిక్కోలుకు రూ. 5లక్షలు ఆర్థిక సాయం చేశారు. ఏపీ సీఎం రిలీప్ ఫండ్‌కు డబ్బులు పంపినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడలించారు. గతంలో కేరళకు సాయం చేశారు. ఇప్పుడు మనవాళ్లకు సాయం చేయాల్సిన అవసరం ఉందని విజయ్ పోస్ట్ చేశారు.

తనకు వచ్చిన తొలి ఫిలింఫేర్‌ అవార్డును వేలం వేసి, వచ్చిన 25లక్షలను తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇచ్చి గొప్ప మనసు చాటుకున్న విజయ్ తర్వాత కేరళ తుఫాన్ బాధితులకు అండగా నిలిచారు. తాజాగా ఏపీలో తిత్లీ తుఫాన్ బాధితులకు బాసటగా నిలిచి రియల్ హీరో అని నిరూపించుకున్నారు.

- Advertisement -