ప్చ్.. ‘విజ‌య్ దేవ‌ర‌కొండ‌’లో మార్పు

23
- Advertisement -

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ప్ర‌స్తుతం ప‌రశురామ్ పెట్ల‌తో ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్నాడు. అలాగే ఈ సినిమా త‌ర్వాతి సినిమాను గౌత‌మ్ తిన్న‌నూరితో చేయ‌నున్నాడు. ఐతే, కీడా కోలా ప్రీ రిలీజ్‌కు ఈవెంట్‌కు చీఫ్ గెస్టుగా వ‌చ్చిన విజయ్, త‌రుణ్ భాస్క‌ర్‌తో మ‌రో సినిమా త్వ‌ర‌లోనే చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించాడు. ఇప్ప‌టికే స్క్రిప్ట్ ఫైన‌ల్ అయింద‌ని కూడా విజ‌య్ ఈ సంద‌ర్భంగా తెలిపాడు. దాంతో ఈ కాంబోలో వచ్చే సినిమా పై అప్పుడే రూమర్స్ మొదలైపోయాయి. సినిమాలో విజయ్ పాత్ర చాలా ఫన్నీగా ఉంటుందని.. ముఖ్యంగా లైఫ్ లో ఫెయిల్ అయిన ఓ వ్యక్తి కథగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

మొత్తానికి విజయ్ దేవరకొండలో ఈ మధ్య మళ్లీ మార్పు కనిపిస్తోంది. నిజానికి సహజమైన కథలు చేయడానికి విజయ్ గతంలో ఆసక్తి చూపించలేదు. కానీ, ఈ మధ్య మాత్రం గ్రౌండ్ లెవల్ లోకి వచ్చినట్లు ఉన్నాడు. ఈ క్రమంలోనే.. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన కీడాకోలా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో విజయ్ క్రేజీ కామెంట్స్ చేశాడు. మన జీవితాన్ని, మనం పెరిగిన వాతావరణం, మనం తీసుకునే నిర్ణయాలు, మనం కలిసే వ్యక్తులే నిర్ణయిస్తారని కూడా విజయ్ దేవరకొండ అన్నారు. పైగా ‘నేను ఈ స్థాయిలో ఉండటానికి నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్, సందీప్ వంగానే కారణం.

నేను నమ్మిందే చేసేరకం తరుణ్. త్వరలోనే తరుణ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాను’’ అంటూ విజయ్ దేవరకొండ చెప్పాడు. ఏది ఏమైనా విజయ్ దేవరకొండలో గట్టి మార్పులు వచ్చాయి. తనకు హిట్లు ఇచ్చిన దర్శకులను ఓ దశలో విజయ్ పట్టించుకోలేదు. ప్రస్తుతం వరుసగా ప్లాప్ లు పడేసరికి విజయ్ లో అణుకువ వచ్చినట్టు ఉంది. అందుకే తన దర్శకులను మంచి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

Also Read:ఓటీటీ : ఈ వారం చిత్రాలివే

- Advertisement -