వావ్.. బేబీ వాళ్ళను కూడా మెప్పించింది

42
- Advertisement -

టాలీవుడ్ లో బేబీ సినిమాకు క్రేజ్ మామూలుగా లేదు.సాయి రాజేశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సూపర్ హిట్ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ 75 కోట్లు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. ఒకపక్క వర్షాలు పడుతున్నా.. ఈ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి బాగానే కలెక్షన్స్ ఉన్నాయట. ఈ ఊపు చూస్తుంటే.. ఈ రోజుతోటి బేబీ 80 కోట్ల మార్క్ ను కూడా చేరుకుంటుందని తెలుస్తోంది. నిజంగా ఒక చిన్న సినిమా 80 కోట్ల మార్క్ ను అందుకోవడం అంటే.. అది సరికొత్త రికార్డే. పైగా కొందరు సినీ ప్రముఖుల నుంచి కూడా బేబీకి ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఇప్పటికే లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త విఘ్నేష్ శివన్ బేబీ చిత్రయూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఒక కొత్త బోల్డ్ టీమ్ నుంచి వచ్చిన ఈ కొత్తతరం సినిమా క్రేజీ రికార్డ్స్ బ్రేక్ చేస్తోంది. ఈ గ్రాండ్ సక్సెస్‏కు కుదోస్. చాలా బోల్డ్‎గా రాశారు. బ్రూటల్ గా చిత్రీకరించారు.’ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో విఘ్నేష్ శివన్ రాసుకొచ్చాడు. అలాగే, రామ్ పోతినేని బేబీ టీమ్‌ కి బెస్ట్ విషెస్ తెలుపుతూ, ఫ్ల‌వ‌ర్స్ పంపారు. ఈ విష‌యాన్ని వైష్ణ‌వి చైతన్య ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డిస్తూ రామ్ కి థాంక్స్ కూడా తెలియ‌చేసింది.

Also Read:బీఏసీ సమావేశాన్ని బైకాట్ చేసిన బీఆర్ఎస్..

మొత్తానికి ప‌లువ‌రు సెల‌బ్రిటీలు ఈ సినిమాను ప్ర‌శంసిస్తున్న వేళ‌, మెగాస్టార్ చిరంజీవి నుంచి కూడా బేబీ టీమ్ కి రేపు సర్ ప్రైజ్ అందనుంది. రేపు చిరు బేబీ టీమ్ ను పిలిపించుకుని అభినందించనున్నారు. మొత్తమ్మీద బేబీ ప్రేక్షకులనే కాదు, సినిమా వాళ్ళను కూడా ఆకట్టుకుంది. కాగా ఈ సినిమా ఆగస్టు చివరివారంలో లేదా.. సెప్టెంబర్ మొదటి వారంలో ఓటీటీలోకి రానుందని సమాచారం. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ బేబీ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.

Also Read:‘ఓ మై గాడ్ 2’కు సెన్సార్ షాక్!

- Advertisement -