రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాంః వేణుగోపాల చారి

502
Venugopalachary
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్థ లపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి. సీఎం కేసీఆర్, సిఎండి ప్రభాకర్ రావు కు రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని ఈసందర్భంగా డిమాండ్ చేశారు. నిన్న రేవంత్ రెడ్డి విద్యుత్ కొనుగోళ్లపై చేసిన ఆరోపణలపై నేడు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

సిఎండి ప్రభాకర రావు గత ప్రభుత్వాలలో కూడా వివిధ హోదాలో పని చేశారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్, సీఎండి ప్రభాకర్ రావు వల్లే తెలంగాణ రాష్ట్రం లో వెలుగు నిండాయి. రాజకీయ నాయకులపై చేస్తున్న ఆరోపణలను ఉద్యోగుల పై చెయ్యడం దురదృష్టకరం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 77 వేల మంది కార్మికులు అన్ని సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణ లో నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్న ఘనత సీఎండి ప్రభాకర్ రావుదని చెప్పారు.

అవినీతి గురించి రేవంత్ మాట్లాడటం హాస్యస్పదం అన్నారు. దేశానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో అందరికి తెలుసన్నారు. రికార్డ్ సమయంలో కొత్తగూడెం పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేశారన్నారు. విద్యుత్ పై చర్చకు తాము సిద్ధం,అయ్యా రేవంత్ నీవు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అన్నారు.

- Advertisement -