వెంకటేష్ 75వ సినిమా డీటైల్స్

25
- Advertisement -

విక్టరీ వెంకటేష్ నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఎఫ్ 3 తర్వాత రాణా నాయుడు సిరీస్ , సల్మాన్ ఖాన్ సినిమాకి షిఫ్ట్ అయిన వెంకటేశ్ తెలుగులో ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయకుండా ఇప్పటి వరకూ దగ్గుబాటి ఫ్యాన్స్ ను వెయిట్ చేయించాడు. ఫైనల్ గా యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను తో ఈరోజే వెంకీ 75 వ సినిమా ఎనౌన్స్ అయింది.

హిట్ ఫ్రాంచైజ్ దర్శకుడు శైలేష్ కొలను చెప్పిన కథ నచ్చడంతో వెంకీ తన లాండ్ మార్క్ మూవీ ను ఈ దర్శకుడి చేతిలో పెట్టాడు. ఈ కాంబో సినిమాను నిహారికా ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై శ్యామ్ సింగ రాయ్ నిర్మాత వెంకట్ బోయనపల్లి నిర్మించనున్నాడు. జనవరి 25న రిపబ్లిక్ డే స్పెషల్ గా ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని డీటైల్స్ ఇవ్వనున్నారు.

తాజాగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ ఎనౌన్స్ మెంట్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. శైలేష్ వెంకీ ను కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నాడని ఇది వరకు చూడని రోల్ లో వెంకీ కనిపిస్తాడని సమాచారం. వెంకటేష్ సరసన ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిది శెట్టి హీరోయిన్ గా నటించనుందని టాక్. త్వరలోనే ఆమె పేరు ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -