సీఎం కేసీఆర్‌ ఏ పనిచేసినా రైతుల కోసమే:ప్రశాంత్ రెడ్డి

472
minister vemula
- Advertisement -

సీఎం కేసీఆర్ ఏ పని చేసినా పేద రైతుల కోసమేనని చెప్పారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం డిచ్ పల్లి మండలం బీబీపూర్ తాండలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ  సందర్భంగా మాట్లాడిన ప్రశాంత్ రెడ్డి… సీఎం కేసీఆర్ వేలాది ఇండ్లు పేదలకు కట్టిస్తున్నారని చెప్పారు.

స్థలం ఉన్న వారు ఇంటిని నిర్మించుకోడానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తోందని చెప్పారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చిన సీఎం కేసీఆర్ కి ధన్యావాదాలు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇండ్లను ఇస్తున్నామని చెప్పారు. ప్యాకేజి 21 ద్వారా పైపులైన్లు వేసి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నిరందిస్తామని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లను ఎవరూ ఆముకోకూడదు… సీఎం కేసీఆర్ పేదలకు ప్రేమతో ఇచ్చారని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

- Advertisement -