కబడ్డీ -క్రైమ్‌ని మిక్స్ చేస్తే..వీడెవడు

221
Veedevadu Theatrical Trailer
- Advertisement -

తాతినేని సత్య డైరెక్షన్ లో సచిన్ జోషి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వీడెవడు’. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. క్రైం మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లో సచిన్ జోషి డైలాగ్‌లతో అంచానాలను పెంచేశాడు. ఓ వైపు రొమాంటిక్ యాంగిల్‌ని చూపిస్తునే మరోవైపు మిస్టరీ థ్రిల్లర్‌గా సచిన్ డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి.

సచిన్ సరసన ఈషా గుప్తా, ధన్య బాలకృష్ణన్ హీరోయిన్లుగా నటిస్తుండగా ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ బాణీలు సమకురుస్తున్నాడు. సచిన్ ఈ మూవీలో కబడ్డీ ఆటగాడుగా కనిపించనున్నాడు. తెలుగు, తమిళ భాషలలో ఈ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేయనున్నారు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్ట్ 25న వీడెవడు ప్రేక్షకుల ముందుకు రానుంది. వీడెవడు థియేట్రికల్ ట్రైలర్ మీ కోసం…

- Advertisement -