ఆ పాత్రల కోసం హీరోగారి కూతురు తాపత్రయం

30
- Advertisement -

వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌ నిజానికి హీరోయిన్ మెటీరియల్. కానీ ఆమె మాత్రం లేడీ విలన్ గా పాపులర్ అయ్యింది. అయితే, వ‌ర‌ల‌క్ష్మీ మళ్లీ హీరోయిన్ గా బిజీ కావడానికి కసరత్తులు చేస్తోంది. పైగా తనకు పరిచయం ఉన్న దర్శకులను, హీరోలను హీరోయిన్ రోల్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తోంది. తాజాగా రవితేజ ఆమెకు తన సరసన హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తోంది. ప్ర‌స్తుతం టైగ‌ర్ నాగేశ్వ‌రరావు, ఈగ‌ల్ సినిమాల‌తో బిజీగా ఉన్న ర‌వితేజ ఆ త‌ర్వాతి సినిమాను త‌న ల‌క్కీ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేనితో చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఓ కీల‌క ఎపిసోడ్ కోసం వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌ను సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారట. గోపీచంద్ మ‌లినేని సినిమాల్లో వ‌ర‌ల‌క్ష్మీ ఇప్ప‌టికే చాలా ప‌వ‌ర్‌ ఫుల్ రోల్స్ చేసిన విష‌యం విదిత‌మే. కాకపోతే.. ఈ సారి హీరోయిన్ గా కనిపించబోతుంది. మరి ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే.. అమ్మ‌డుకి మ‌ళ్లీ హీరోయిన్ గా క్రేజ్ పెరిగే ఛాన్స్ ఉంది. హీరోయిన్ గా వ‌రుస ఆఫ‌ర్లు వస్తే, దానికి తగ్గట్టుగానే అమ్మ‌డు బోల్డ్ సీన్స్‌లో కూడా డౌట్ లేకుండా న‌టిస్తాను అంటుంది.

Also Read:ప్చ్.. తెలుగు హీరోలను అవమానపరిచారా?

అటు ఓటీటీ వ‌ర‌ల్డ్‌లో కూడా హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకోవడానికి వ‌ర‌ల‌క్ష్మీ శరత్ కుమార్ బోల్డ్ సీన్స్‌ చేయబోతుంది. ఇప్పటికే ఓ సిరీస్ లో ఆమె రొమాంటిక్ సీన్స్ చేసింది. ఓ వేశ్య పాత్రలో ఆమె తన అందాలన్నీ చాలా ధారాళంగా పరిచిందట. మొత్తానికి వ‌ర‌ల‌క్ష్మీ శరత్ కుమార్ తనలోని కొత్త అందాలను ఆరబోసి ఎలాగైనా స్టార్ హీరోయిన్ అయిపోవాలని కలలు కంటుంది. మరి ఆమె కలలు నెరవేరతాయా ? లేదా ? అనేది కాలమే జవాబు చెప్పాలి.

Also Read:సమంత పై అభిమానులు సీరియస్

- Advertisement -