ఆ కేసుతో సంబంధం లేదు:వరలక్ష్మి

29
- Advertisement -

డ్రగ్స్ కేసులో తన ప్రమేయంపై వస్తున్న వార్తలను నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఖండించారు. డ్రగ్స్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. గతంలో తన వద్ద పని చేసిన మేనేజర్‌‌ పేరు చెప్పేందుకు వరలక్ష్మి మేనేజర్ అని చెప్పారని అన్నారు. అలా అయితేనే చూస్తారని నా పేరును ఇందులోకి తీసుకొచ్చారని చెప్పుకొచ్చింది. మాన్షన్ 24’ హారర్ వెబ్ సిరీస్‌ ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్‌లో ఈ విషయంపై వరలక్ష్మి స్పందించింది.

అలాగే, డ్రగ్స్‌ కేసులో తనపై వచ్చిన ఆరోపణలపై వరలక్ష్మీ శరత్‌కుమార్‌ మాట్లాడుతూ… ఈ కేసులో తనకు నోటీసులు అందాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేసింది. తనకి ఎలాంటి సమన్లు, లేదా ఫోన్‌ కాల్స్‌ రాలేదని వరలక్ష్మీ తెలిపింది. మొత్తమ్మీద డ్రగ్స్‌ కేసుకు సంబంధించి తన మేనేజర్‌ పేరుతో వార్తలు వచ్చాయని.. ఆ మేనేజర్ పేరుకి ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడంతో వరలక్ష్మీ ఫొటోని వాడుకోవడం దారుణం.

వరలక్ష్మీ శరత్ కుమార్ గతంలో జరిగిన ఓ సంఘటన గురించి కూడా చెబుతూ.. గతంలో ఓ పెద్ద హీరో సినీ.a విడుదలై బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. ఐతే ఇందులో కీలక పాత్రలో నటి వరలక్ష్మీ నటించారు. దీనిపై ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన వల్లే అది ఫ్లాప్‌ అయ్యిందని చాలా మంది అన్నారన్నారు. ‘నువ్వు ఇంకా ఎందుకు బతికే ఉన్నావు. చచ్చిపోవచ్చు కదా..? దీనికి మించి ఇంకేం చేయాలనుకుంటున్నావ్‌?’ అని తీవ్రంగా దూషించారని తెలిపారు.

Also Read:‘జై భారత్’..ఆవిష్కరించిన ప్రకాష్ అంబేద్కర్

- Advertisement -