పప్పు అండ్ బ్యాచ్‌పై వంశీ ఫైర్..

477
vamshi
- Advertisement -

ఏపీ అసెంబ్లీ వేదికగా టీడీపీ,చంద్రబాబు,లోకేష్‌పై విమర్శలు గుప్పించారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. పప్పు అండ్ బ్యాచ్‌ తనపై సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని చెప్పారు. జయంతి, వర్థంతికి తేడా తెలియని ఓవ్యక్తి, 40 ఏళ్లు రాజకీయ అనుభవం ఉందని చెప్పే చంద్రబాబుకు తాను మాట్లాడితే ఉలికెందుకు అని ప్రశ్నించారు.

సీఎం జగన్‌ని కలిసినంత మాత్రాన తన క్యారెక్టర్‌‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని చంద్రబాబుకు చెప్పినా పట్టించుకోలేదన్నారు. మంచి నిర్ణయాలను స్వాగతించాలని చెప్పానని కానీ తన చేత ప్రెస్‌మీట్‌లు పెట్టించి జగన్‌పై విమర్శలు చేయించారని చెప్పారు. తాను టీడీపీతో ఉండలేనని…. అందుకే తనను సభలో ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని కోరారు.

పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఎంతో ఉపయోగ పడుతుందని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు వలన పేదలకు మేలు జరుగుతుందని..ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్య శ్రీ వలన ఎంతో మంది జీవితాలు బాగుపడ్డాయి అన్నారు.

Gannavaram MLA Vallabaneni vamshi slams Lokesh,TDP. Gannavaram MLA Vallabaneni vamshi slams Lokesh,TDP.

- Advertisement -