థియేటర్లలో మళ్లీ రిలీజ్ కానున్న ‘వకీల్ సాబ్’..!

171
Vakeel Saab
- Advertisement -

పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్‌ ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా దిల్ రాజు నిర్మించారు. శ్రుతి హాసన్ కథానాయికగా నటించగా, నివేదా థామస్ .. అంజలి .. అనన్య ముఖ్యమైన పాత్రల్లో మెప్పించారు. హిందీలో విజయం సాధించిన ‘పింక్’కి రీమేక్ గా ఈ సినిమా వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ‘వకీల్ సాబ్’ భారీ వసూళ్లను రాబట్టింది. పవన్ రీ ఎంట్రీ ఒక సూపర్ హిట్ మూవీతో జరగడం పట్ల ఆయన అభిమానులంతా కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు.

అయితే సినిమా వచ్చిన రెండు వారాల గ్యాప్ లోనే కరోనా వైరస్ తీవ్రత పెరిగి పోవడంతో కలెక్షన్స్ కూడా దారుణంగా పడిపోయాయి. మరో దారిలేక కేవలం 19 రోజుల వ్యవధిలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో సినిమాలు విడుదల చేశారు. దాంతో పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లో చూడాలని ఆశ పడిన చాలామంది అభిమానులకు, ప్రేక్షకులకు ఈ వైరస్ బ్రేకులు వేసింది. ఈ సమయంలో వకీల్ సాబ్ దర్శక నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం తగ్గుతుండడంతో త్వరలో థియేటర్లు తెరుచుకోనున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే 300 థియేటర్లలో ‘వకీల్ సాబ్’ను మళ్లీ రిలీజ్ చేసే ఆలోచనలో దిల్ రాజు ఉన్నాడని అంటున్నారు. అయితే పాత సినిమా కాకుండా కొన్ని కొత్త సన్నివేశాలు యాడ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నారు. నిడివి ఎక్కువ అయినా కూడా కొన్ని సన్నివేశాలు జత చేస్తే చూసే ప్రేక్షకులకు కొత్తగా ఉంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.

- Advertisement -