వెబ్ ప్రొడక్షన్ లోకి యువీ క్రియేషన్స్

350
uv creations
- Advertisement -

భారీ చిత్రాలు నిర్మించడంతో పాటు తెలుగు ప్రేక్షకులకు వైవిధ్యమైన సినిమాలు అందించడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది యూవీ క్రియేషన్స్ సంస్ధ. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్నేహితులు వంశీ ప్రమోద్ లు ఈ సంస్దను నడిపిస్తున్నారు. ప్రభాస్ మిర్చి సినిమాతో నిర్మాణరంగంలో అడుగుపెట్టిన ఈ సంస్ధ మొదటి మూవీతోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆతర్వాత శర్వానంద్ తో రన్ రాజా రన్ తో మరో హిట్ సాధించింది. ఆ తర్వాత జిల్, భలేభలే మగాడివోవ్, ఎక్స్ ప్రెస్ రాజా, మహానుభవుడు, భాగమతి, ట్యాక్సివాలా, సాహో వంటి భారీ విజయాలను నిర్మించారు.

తాజాగా ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఈమూవీకి జిల్ మూవీ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇప్పటివరకు సినిమా నిర్మాణ రంగంలో టాప్ ప్లేస్ లో ఉన్న ఈసంస్ధ వెబ్ సిరీస్ నిర్మాణ రంగంలోని అడుగుపెడుతున్నారు. ఫ్యూచర్ మొత్తం వెబ్ సిరీస్ లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పైగా ప్రస్తుత రోజుల్లో ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు బాగా డిమాండ్ పెరిగింది. దీంతో యూవీ క్రియేషన్స్ సంస్ధ వెబ్ సిరీస్ లను కూడా నిర్మించనుంది. సినిమా నిర్మాణంలో భారీగా లాభాలను సాధించిన సంస్ధ వెబ్ సిరీస్ లలో ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.

- Advertisement -