ఉత్తరాఖండ్ సీఎంకు కరోనా పాజిటీవ్‌..

121
Uttarakhand CM
- Advertisement -

దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ ఒక్కరోజే 46,951 క‌రోనా కేసులు నమోదైయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందని కేంద్రం భావిస్తోంది. పలువురు రాజకీయవేత్తలు, సెలబ్రిటీలు, క్రీడాకారులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ కు కరోనా సోకింది.

తనకు నిర్వహించిన కరోనా టెస్టులో పాజిటివ్ అని తేలిందని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం బాగానే ఉన్నానని ఎలాంటి ఆందోళన చెందడం లేదని చెప్పారు. హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నానని… డాక్టర్లు తన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని అన్నారు. ఇటీవలి కాలంతో తనకు కాంటాక్ట్ లోకి వచ్చిన వచ్చిన వారంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని కోరారు.

- Advertisement -