ఉత్తమ్ కుమార్ క్షమాపణ చెప్పాలి: హరీష్ రావు

4
- Advertisement -

నిండు శాసనసభను తప్పుదోవ పట్టించిన మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ మేరకు ఉత్తమ్‌కు పలు ప్రశ్నలు సంధించారు.

1, తాను పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ మెంబర్ గా ఉన్న సమయంలోనే మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వం రద్దు (ఎక్స్ పెల్) జరిగిందని ఈరోజు సభలో చెప్పుకున్న ఉత్తం కుమార్ రెడ్డి, తాను ఆ రద్దును వ్యతిరేకిస్తూ అది అన్యాయమని, రాజ్యంగ విరుద్ధమని అసమ్మతి నోటు ఇచ్చిన విషయాన్ని దాచి పెట్టారు.

తాను ఇచ్చిన అసమ్మతి నోట్ లో మహువా మెయిత్రాను వ్యక్తిగత ద్వేశం, ప్రతీకార చర్యల్లో భాగంగానే ఎక్స్ పెల్ చేసారని సైతం పేర్కొన్నాడు.

2, నాడు గవర్నర్ పై దాడి చేసిన విషయంలో ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి లను ఎక్స్ పెల్ చేసిన సందర్భంలోనూ అది తప్పుడు చర్య అని, ఈ విషయంలో రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తమని పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తం మాట్లాడారు.

Also Read:స్మార్ట్ రేషన్ కార్డు..ప్రత్యేకతలివే!

నాడు స్పీకర్, ముఖ్యమంత్రి వారి విధులను సరిగ్గా నిర్వహించలేదని ఉత్తం ఆరోపించాడు.
నేడు ఆ మాటలను కూడా దాచి పెట్టారు.

ఒకవైపు తాను వ్యతిరేకించిన వాటినే నేడు ఉదాహరిస్తూ మరోవైపు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలనడం మీ కక్ష్య సాధింపు, ఉద్దేశ్య పూర్వక చర్యలను ప్రతిబింబిస్తున్నది.

ప్రతిపక్షంలో ఉండగా ఒక తీరు, అధికారంలోకి రాగానే మరొక తీరు.

నాడు తప్పు అనిపించింది, నేడు ఒప్పు ఎలా అనిపిస్తుంది ఉత్తం గారూ..? చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisement -