మిరియాలతో ఆరోగ్యం..

55
- Advertisement -

మిరియాలు పొడి గా చేసుకోని, పెరుగులో కలుపు కొనితగితే జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది.

మిరియాలు, వేపకు, నీళ్ళు ఈ ముండింటిని కలిపి మిక్సీ వేసి ఆ తరువాత ఆ నీళ్ళు వడకట్టి తాగితే శరీరం లో దురదలు మట్టు మాయం అవుతాయి.

మిరియాలు పొడి చేసి తేనెలో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. పొట్ట ఉబ్బరం తగ్గించే గుణాలు మిరియాలలో పుష్కలంగా ఉన్నాయి.

అరటి పండు లో మిరియాల పొడి చల్లి తినిపిస్తే శిశువులకు జీర్ణం సరిగా అవుతుంది.

కండరాలు,నరాలు నొప్పిగా ఉన్నప్పుడు చిటికెడు మిరియాల పొడి బాదంపప్పుతో కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

చిగుళ్ల వాపు,నోటి నుంచి రక్తం కారడం వంటి సమస్యలు బాధిస్తుంటే చిటికెడు రాళ్ల ఉప్పు , మిరియాల పొడి మిశ్రమాన్ని చిగుళ్లకు రాసి గోరు వెచ్చని నీటితో పుక్కిలిస్తే ఉపశమనం లభిస్తుంది.

Also Read:బీజేపీ లోగోను తొలగించిన ఈటల

కీళ్ల నొప్పులతో బాధపడే వారు మిరియాలను నువ్వుల నూనెలో వెయించి పొడి చేసి నొప్పి ఉన్నచోట ఈ మిశ్రమాన్ని కట్టు కడితే నొప్పి,వాపు తగ్గుతాయి,

శరీరంలో అధిక కొవ్వును తగ్గించడానికి మిరియాల రసం తాగితే మంచి ఫలితం ఉంటుంది.

గోంతు గరగరగా వుంటే గోరు వెచ్చని పాలలో మిరియాలపొడి ,అర స్పూన్ పసుపు, స్పూన్ తేనె కలిపి తాగితే ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

అరగ్రాము మిరియాల పొడి, ఒక గ్రాము బెల్లం కలిపి రోజూ ఉదయం తీసుకుంటే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

- Advertisement -